Header Banner

Coronavirus: దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసుల కలకలం.. ఆ రాష్ట్రాలలో వణుకు పుట్టిస్తుంది!

  Wed Jun 18, 2025 20:58        Health

దేశవ్యాప్తంగా ఇటీవల కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ తాజా కేసుల పెరుగుదలకు ఒమిక్రాన్‌కు చెందిన నాలుగు కొత్త ఉపరకాలే (సబ్ వేరియంట్లు) కారణమని పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ) నిర్ధారించింది. జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా ఈ కొత్త ఉపరకాలను గుర్తించినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ పరిశోధన ఫలితాలు వ్యాక్సిన్‌ల సామర్థ్యాన్ని అంచనా వేయడంలో ఉపయోగపడతాయని వారు తెలిపారు. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసుల నమూనాలను విశ్లేషించినప్పుడు ఒమిక్రాన్‌కు చెందిన నాలుగు ఉపరకాలు వెలుగులోకి వచ్చినట్లు ఎన్‌ఐవీ-పుణె డైరెక్టర్ డాక్టర్ నవీన్ కుమార్ వివరించారు. "మేము వీటిని ఎల్‌ఎఫ్‌.7, ఎక్స్‌ఎఫ్‌జీ, జేఎన్‌.1.16, ఎన్‌బీ.1.8.1 వేరియంట్లుగా గుర్తించాం. మొదట్లో జేఎన్‌.1.16 వేరియంట్ వల్ల కేసులు పెరిగినా, ఈ ఏడాది మే నెల నుంచి ఎక్స్‌ఎఫ్‌జీ వేరియంట్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఎల్‌ఎఫ్‌.7, ఎల్‌పీ.81.2 అనే రెండు వేరియంట్లు కలిసి ఎక్స్‌ఎఫ్‌జీగా రూపాంతరం చెందాయి" అని డాక్టర్ నవీన్ కుమార్ తెలిపారు.

 

ఇది కూడా చదవండి: Jagan: జగన్ ఇంత ఘోరం చేస్తాడని అనుకోలేదు.. ఇద్దరు ప్రాణాలను తీసేసిన వైసీపీ మూకలు!

 

కొత్త వేరియంట్లను ఎప్పటికప్పుడు గుర్తించి, వాటి జన్యుక్రమాన్ని విశ్లేషించే ప్రక్రియ నిరంతరం కొనసాగుతోందని ఆయన చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్ రెండో వారం నుంచి దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 6,483 కొవిడ్-19 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఇప్పటివరకు కరోనా కారణంగా 113 మంది మరణించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ముఖ్యంగా కేరళలో కొవిడ్ ప్రభావం ఎక్కువగా ఉండగా, గుజరాత్, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాల్లో కూడా వైరస్ వ్యాప్తి అధికంగానే ఉంది. అయితే, ప్రస్తుతానికి ఇన్ఫెక్షన్ తీవ్రత తక్కువగానే ఉందని, బాధితులు ఎక్కువగా ఇళ్లలోనే ఉంటూ అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. వ్యాధి లక్షణాలు స్వల్పంగా ఉండటంతో ఆసుపత్రులలో చేరేవారి సంఖ్య తక్కువగానే ఉందని తెలుస్తోంది. అయినప్పటికీ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కొవిడ్ నిబంధనలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
 

ఇది కూడా చదవండి: Adabidda nidhi Scheme: ఏపీ మహిళలకు శుభవార్త.. నెలకు రూ. 1500పై కీలక అప్‌డేట్! ఈ పథకం త్వరలోనే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

 

Political Update: వైసీపీ నేతలకు బిగుస్తున్న ఉచ్చు! కలకత్తా పోలీసులు అదుపులో మాజీ మంత్రి!

 

ఏపీలో కొత్తగా నాలుగు లైన్ల నేషనల్ హైవే! రూ.4,609 కోట్లతో, ఈ రూట్‌లోనే..

 

 Economy Park: ఆ ప్రాంతం ప్రజలకు శుభవార్త! చంద్రబాబు మరో కీలక నిర్ణయం! రూ.1500 కోట్లతో.. 400 ఎకరాల్లో..

 

Changes in Caste Name: ప్రభుత్వం కీలక నిర్ణయం! ఆ కులం పేరు మార్పు!

 

Lookout Notices: వైసీపీ నేతకు ఝలక్! లుక్ అవుట్ నోటీసులు జారీ! పోలీసుల కస్టడీలో..

 

Gold rates: పసిడి ప్రియులకు శుభవార్త... భారీగా తగ్గిన బంగారం ధరలు!

 

Andhra Economy: చంద్రబాబు సమీక్షలో దిశానిర్దేశం! 15% వృద్ధి లక్ష్యంతో ప్రత్యేక కార్యాచరణ!

 

Free bus: ఆడవాళ్ళకి అదిరిపోయే శుభవార్త... ఆగస్టు 15 నుంచి అమలు!

 

 Annadaata sukibhava: రైతులకు బిగ్ రిలీఫ్! వారికి ఈ కేవైసీ అక్కర్లేదు.. స్టేటస్ చెక్ చేసుకోండి!

 

రేషన్ వ్యవస్థలో కీలక మార్పులు! ఇక నుంచి ఇలా!

 

ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే.. ఒక్కొక్కరికి రూ.50వేల నుంచి రూ.లక్ష ఇస్తారు!

 

ఏపీలో 18ఏళ్లు దాటిన ప్రతీ మహిళ అకౌంట్లో రూ.18వేలు! అర్హులు, అర్హతల వివరాలు ఇవే!

 

Praja Vedika: నేడు (18/6) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #coronavirus new #omicron #subvariants #identified #india